మన్యం టివి, ములకలపల్లి మండలం: కొత్తగూడెం లో జిల్లా ప్రజా పరిషత్ ఆఫీస్ లో విద్య , వైద్య ,స్టాండింగ్ కమిటి సమవేశం లో జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య తో ములకలపల్లి మండలం జెడ్పిటిసి సున్నం నాగమణి పాలుగొన్నారు.ఈ సమవేశం లో కరోనా టెస్టులు చెయ్యలని , ప్రజలకు కరోనా టీకాలు వెయ్యాలని చెప్పటం జరిగింది. మన జిల్లా లో కరోనా టెస్టులు చెయ్యక ,కరోనా టీకాలు లేక ప్రజలు చాల ఇబ్బందులకు గురవుతున్నారని , మరణాలు కూడ సంభవిస్తున్నాయని,ఛైర్మన్ కోరం కనకయ్య దృష్టికి ,డీ.హెచ్.ఎం. ఓ.శిరీష దృష్టికి ఈ విషయాలు గట్టిగా చెప్పడం జరిగింది. కరోనా వచ్చిన వారికీ మండల ప్రాథమిక వైద్య కేంద్రాలలో మెరుగైన వైద్యం అందించాలని,కరోనా టెస్టులు లేకపోవటం మూలంగా ప్రజల్లో ఎవరికి కరోనా ఉందొ తేలియటం లేదని, కరోనా వచ్చిన వాళ్ళు ప్రజల్లో తిరుగుతున్నారని,తెలియపరచగానే పై పేర్కొన్న సమస్యలపై వారూ సానుకూలంగా స్పందించారని తెలియపరచడం జరిగింది. ఈ సమవేశం లో జిల్లా పరిషత్ డిప్యూటీ సి.ఇ.ఓ బి.నాగలక్ష్మీ ,జిల్ల ప్రజా పరిషత్ ఉప ముఖ్య కార్య నిర్వాహ అధికారి ,జిల్లా ఆధికారులు పాల్గోన్నారు.
Post A Comment: