మన్యం టీవీ, బూర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కరోనా మహమ్మారి తాండవిస్తున్న సమయం ప్రస్తుతం లాక్ డౌన్ ఇలాంటి సమయంలో బంధువులను కూడా ఇంటికి రానివ్వని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో యాచకులకు ఎవరూ ఇంటిముందుకు రానివ్వనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో బూర్గంపాడు మండల కేంద్రంలోని సంత ఆవరణలో ఉన్నటువంటి యాచకులకు మేము ఉన్నాము అంటూ బూర్గంపాడు టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గోనెల నాని అతని మిత్ర బృందంతో కలసి 30 మంది యాచకులకు భోజన సదుపాయం ఎర్పాటు చెయ్యడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని బూర్గంపాడు ఎస్ఐ సముద్రాల జితేందర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇదే యూత్ గడిచిన కరోనా కష్ట కాలంలో ఎంతో మంది పేదలకు నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరిగింది. మున్ముందుకూడా ఇటువంటి సేవ కార్యక్రమాలు చేయడానికి ముందడుగులో ఉంటామని గోనెల నాని మిత్రబృందం అన్నారు.ఈ కార్యక్రమంలో తోకల సతీష్,గంగరాజు యాదవ్, బబ్బు రాయుడు, హరిబాబు, బర్ల ప్రవీణ్, బర్ల ముత్యం, కొండ్రు నాగరాజు శామకూరు సతీష్, గోనెల రామకృష్ణ, చుండ్రు బాలకృష్ణ, బర్ల ప్రవీణ్,బొగ్గుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: