మన్యం టీవీ ఏటూరు నాగారం:
మంగపేట మండలం సొసైటి సింగిల్ విండో డైరెక్టర్ సురేష్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని ఆయన మరణ వార్త దిగ్భ్రాంతి కి గురి చేసిందని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఆయన పార్టికి చేసిన సేవలు ఎన్నటికి మరవలేనివి అని మండలము లోని అన్ని వర్గాల వారికి రైతులకు అత్యంత సన్నిహింతంగా మెలిగె వారు అని రైతులకు అనునిత్యము అండగా నిలిచేవాడని వారి అకాల మరణము బాధాకరమైన విషయమని అన్నారు. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తు వారికి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని ఈ సందర్బంగా సీతక్క అన్నారు.
Post A Comment: