ఐటీడీఏ పీవో హనుమంతు కె జెండాగే.
మన్యం టీవీ ఏటూరు నాగారం:
గిరిజన సంక్షేమ శాఖ అందించే ఆర్థిక స్వావలంబన పథకాలకు పేద గిరిజన ఎంపిక చేయాలని ఐటీడీఏ పీవో హనుమంతు అధికారులను ఆదేశించారు. ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకతను ప్రదర్శించాలని సూచించారు. ఆర్థిక స్వావలంబన పథకాల లబ్ధిదారుల ఎంపిక చేసేందుకు ములుగు జిల్లా లోని తొమ్మిది ఎంపీడీవోలు సంబంధిత అధికారులతో కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపికకు గ్రామాల్లో సభలు నిర్వహించాలని గ్రామ సభలకు మండల ఎంపిక కమిటీ సభ్యులంతా విధిగా హాజరు కావాలని చెప్పారు. అందరి సమక్షంలో గ్రామసభల్లో లబ్ధిదారుల అర్హతలను పరిశీలించి ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. వ్యక్తిగత అభిప్రాయాలకు తావీయ వద్దని సూచించారు. గిరిజనులు నిరుపేద, పేదవారు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించాలని అన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన యూనిట్లను పెంచేందుకు ప్రతిపాదనలు పంపించామని దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఉన్నతాధికారులతో చర్చించి ఎక్కువ యూనిట్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.
ఈ సమావేశంలో ఏపీఓ వసంతరావు, జిల్లా వ్యవసాయ అధికారి గౌస్ హైదర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి భాస్కర్, పరిశ్రమాభివృద్ధి అధికారి వీరన్న నాయక్, గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు మంకీడీ ఎర్రయ్య 9 మండలాలకు సంబంధించిన ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: