గుండాల ( మన్యం టీవీ ) సిపిఎం మండల కార్యదర్శి జోగా నర్సయ్య కరోనా మృతి చెందాడు . మండలంలో సిపిఎం పార్టీ కోసం ఎలా లేని సేవలు అందించాడు విప్లవ పార్టీతో ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉన్న జోగా నర్సయ్య మృతి చెందడం పలువురుని కంటతడి కి గురిచేసింది. గత కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతూ ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. సి పి ఈ ఎస్ ఐ తుడుం దెబ్బ తదితర పార్టీలో పనిచేసి ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలను నడిపించాడు. గత కొన్ని సంవత్సరాలుగా సిపిఎం పార్టీ లో చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ కార్యదర్శి ఈ స్థాయికి ఎదిగారు. గత కొన్ని రోజుల క్రితం యోగ నరసయ్య అన్న సైతం కరోనా బారిన పడి మృతి చెందాడు. కుటుంబంలో ఇద్దరు కొద్ది రోజుల వ్యవధిలో మృతిచెందడంతో రెండు కుటుంబాల్లో తీరని దుఃఖం మిగిల్చాయి కరోన బారినపడి ఇంటికి పెద్దదిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు నిస్సహాయత కు గురవుతున్నారు మన్యం టీవీ
Post A Comment: