మన్యంటీవీ,అశ్వారావుపేట:
మండల పరిధిలోని ఆరోగ్య కేంద్రాల వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలో శనివారం మరో 33 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదు కాబడ్డాయి. వినాయకపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 44 టెస్టులు నిర్వహించగా 17 మందికి, అశ్వరావుపేట లో 42 మందికి టెస్టులు చేయగా 13 మందికి, గుమ్మడవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 20 టెస్టులు చేయగా ముగ్గురికి పాజిటివ్ వచ్చిందని వైద్య అధికారులు తెలిపారు. ప్రజలందరూ కూడా తప్పనిసరిగా మాస్కో శానిటైజర్ ఉపయోగిస్తూ లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని వైద్య అధికారులు ఆదేశించారు.
Post A Comment: