ఇంటింటి సర్వే,సమస్యపై వెంటనే స్పందన. మున్సిపాలిటీ లో తనకంటూ చెరగని ముద్ర వేస్తున్న కమిషనర్.
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లో ప్రజల శ్రేయస్సే మా అభివృద్ధి అంటున్న మున్సిపల్ కమిషనర్ నాగ ప్రసాద్. మణుగూరు మున్సిపాలిటీ లో సమస్యలు లేకుండా చూస్తామన్నారు.గురువారం మణుగూరు లోని ఐలమ్మ నగర్ నందు ఉన్న సమస్యలు తీర్చుటకై ఇంటింటి సర్వే నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ నాగ ప్రసాద్ మరియు మున్సిపల్ సిబ్బంది వీధి లైట్లు, డ్రైనేజీలు,రోడ్లు,వరద ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు.వెంటనే స్పందించి వీధి లైట్లు ను ఏర్పాటు చేశారు. డ్రైనేజీల కు,సిసి రోడ్ల నిర్మాణానికి, ఎస్టిమేషన్ వేయించారు.
వెంటనే గ్రావెల్ పోసి రోడ్లు బురద లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఐల్లమ్మ నగర్ లోని సమస్యలపై మున్సిపల్ కమిషనర్ నాగ ప్రసాద్ కు వినతిపత్రాన్ని అందజేసారు. ఈ కరోన కష్టకాలంలో అహర్నిశలు శ్రమిస్తున్న మున్సిపల్ సిబ్బందిని, ఐల్లమ్మనగర్ వాసులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నగర వాసులు రాపర్తి ధర్మయ్య, వెంకటమ్మ,శ్రీహరి,కుమ్మరి కుంట్ల సుధాకర్, నరసింహారావు,రాంబాబు, సోమేశ్,రజిత,సరిత,ప్రవళిక నిహారిక,నగర వాసులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: