వాటర్ ప్లాంట్ నుంచి నీటిని కొoటున్నాం
-పంచాయితీ కార్యదర్శి కి వినతిపత్రం
మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలోని రమనక్కపేట గ్రామంలోని పలు కాలనీల్లో నెల రోజులు గా మంచినీళ్లు రాక కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని ఎస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షుడు తోకల రవి కాంగ్రెస్ పార్టీ మంగపేట మండల యూత్ ప్రెసిడెంట్ ఓదెల సుధీర్ లు ఆరోపించారు. ఈమేరకు సోమవారం వారి ఆధ్వర్యంలో రమణక్కపేట గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యదర్శి వినోద్ కుమార్ కి ఆయా కాలనీల్లో నెలకొన్న తాగునీటి సమస్యలను ఓవినతి పత్రం ద్వారా తెలుపుతూ అందజేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రమణక్కపేట గ్రామంలో ఉన్న విజయరావుపేట,కొత్త కాలనీ ల్లో నెల రోజుల నుంచి మిషన్ భగీరథ మంచి నీళ్లు ఒకరోజు వస్తే ఒక రోజు రాక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కరోనా సమయంలో పేద మధ్య తరగతి ప్రజలు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన,ఆందోళన వ్యక్తంచేశారు.అదేవిధంగా మిషన్ భగీరథ నీళ్లు వచ్చిన సమయం లో ఒక బిందె కంటే ఎక్కువ నీళ్లు కూడా రావడం లేదని, నీళ్ల కోసం ప్రైవేట్, వ్యక్తిగత బావిలోకి పోయినా కానీ వారు రానివ్వడం లేదన్నారు.మంచినీటి సరఫరా లేక తామంతా టిన్ను కు రూ,30 లు పెట్టి ప్రవైట్ గా వాటర్ప్లాంటు నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని వారు వాపోయారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ నుంచి బోరు బావి తీపించాలని వారు కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సదాశివరావు ,రామ్మోహన్ ,నరేష్,
రఘు ,రాజు ,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: