👉ఎంపీపీ రేగా కాళిక
మన్యం టీవీ, కరకగూడెం:
కరోనా కష్టకాలంలో పేదల పక్షాన టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుదని కరకగూడెం మండల ఎంపీపీ రేగా కాళిక అన్నారు.
కరకగూడెం మండలంలోని సీతారాంపురం గ్రామానికి చెందిన షేక్ యాకుబ్ పాష కు ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు షేక్ యాకుబ్ పాష నివాసం వెళ్ళి రూ.36వేల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కరకగూడెం మండల ఎంపీపీ రేగా కాళిక చేతులమీదుగా అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎంపీపీ రేగా కాళిక మాట్లాడుతూ...
మండలంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి,భౌతిక దూరం పాటించి,మాస్కులు ధరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రావుల సోమయ్య,భూర్గంపహడ్ వ్యవసాయ కమిటి ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు,ఆత్మ కమిటి డైరక్టర్ కొంపెళ్ళి పెద్ద రామలింగం,రేగా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: