CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆశా వర్కర్ లను శాలువాలతో సన్మానించి చీరలు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

Share it:

 


*డాక్టర్లను కూడా శాలువాలతో సన్మానించిన ఎమ్మెల్యే.

*కరోనా నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి భోజనాలు అందించిన ఎమ్మెల్యే సీతక్క.

మన్యం టీవీ ఏటూరు నాగారం

తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 30 మంది ఆశ వర్కర్ లను శాలువాలతో సన్మానించి చీరలను అందించిన అనంతరం భోజనం కూడా అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రస్తుత కరోనా వైరస్ కట్టడి చేసేందుకు వైద్యులతో కలిసి కరోనా వైరస్ కట్టడికి వేల సంఖ్యలో ఆశ వర్కర్లు పనిచేస్తున్నారని అన్నారు. ఆ వైరస్ తమనే అంతం చేస్తుందని తెలిసి కూడా తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సేవలు చేస్తున్న ఆశ వర్కర్లు, ప్రమాదం అంచున నిలబడి వైరస్ బారిన పడిన వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు. అనంతరం తాడ్వాయి చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి భోజనాలు అందించిన ఎమ్మెల్యే సీతక్క. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి, మండల అధ్యక్షుడు అనంత రెడ్డి, మాజీ జెడ్పిటిసి దేవేందర్, సహకార సంఘం చైర్మన్ సంపత్ గౌడ్, స్థానిక సర్పంచ్ ఇరప సునీల్ దొర, మాజీ సహకార సంఘం చైర్మన్ పాక సాంబయ్య, ఆరేం లచ్చు పటేల్, ముదురు కోళ్ల తిరుపతి, గ్రామ కమిటీ అధ్యక్షుడు పాక రాజేందర్, సురేష్, మేడం రమణాకర్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: