CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బిజెపి రాష్ట్ర పిలుపులో భాగంగా ఒక పూట దీక్ష చేపట్టిన కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ ..

Share it:

 





మన్యం టీవీ :జూలూరుపాడు, భద్రాద్రి కోత్తగూడెం జిల్లా, జూలురుపాడు లో, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తెలంగాణ రైతుల కోసం ఒక పూట దీక్ష చేయాలని  పిలుపు లో భాగంగా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ తన నివాసంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతుల పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని తాలు, తరుగు, పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు అన్నారు. రైతు దగ్గర ఉన్న ధాన్యాన్ని వెంటనే తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేయాలని  పెండింగ్లో ఉన్న రైతు బంధు డబ్బులు వెంటనే విడుదల చేయాలని రైతులకు ఖరీఫ్ సీజన్ ను మొదలవుతుంది కావున పెట్టుబడి సాయం కింద రైతులకు రైతుబంధు డబ్బులు వెంటనే విడుదల చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి రెండు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంతవరకూ లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదన్నారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు కావున వెంటనే రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ రైతు గోస- బిజెపి పోరు దీక్షలో తెలంగాణ వ్యాప్తంగా బిజెపి కార్యకర్తలు మరియు రైతులు దీక్షలో పాల్గొన్నారని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ అన్నారు.   ఈ దీక్షలో భాగంగా   బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మాదినేను సతీష్, బిజెపి మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్, భూక్య రాజేష్, భానోత్ సురేష్, గోపాల్ రావు, పుల్లారావు, తదితరులు దీక్షలో పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: