మన్యం టీవీ, అశ్వరావుపేట:
మండల పరిధిలోని జమ్మి గూడెం గ్రామ ప్రజలు కరెంటు కోతల వల్ల త్రాగునీటి లేక అవస్థలు పడటం జరుగుతుంది. గాలివాన వచ్చి రెండు రోజులు అవుతుండగా గాలివాన పేరుతో ఈ రోజు వరకు కూడా విద్యుత్తు మరమ్మతుల పేరుతో గ్రామాల్లో కరెంటు కోత విధించడంతో కనీస త్రాగు నీటి వసతి లేక గ్రామ ప్రజలు ఇబ్బందిని మీడియాకి తెలుపుకున్నారు. పంచాయతీ సిబ్బంది పంచాయితీ వాటర్ ట్యాంక్ తో నీటిని సమకూర్చు తున్నప్పటికీ కోవిడ్-19 కారణంగా నీటి కోసం అందరూ ఒక దగ్గరకు రావడం చూసి జనం భయపడుతున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ అధికారులు త్వరగా స్పందించి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నారు.
Post A Comment: