మన్యం టీవీ ఏటూరు నాగారం:
రెండో విడతలో భాగంగా కోవిడ్ ఫీవర్ సర్వే ను ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఆదివారం అంగన్వాడి టీచర్లు, ఆశావర్కర్లు గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ కోవిడ్ పాజిటివ్, నెగిటివ్ కేసులు విచారణ చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశానుసారం అధికారులు సిబ్బంది గతంలో చేసిన సర్వే ఆధారంగా రెండోసారి కూడా ఇంటింటికి తిరుగుతూ గతంలో వచ్చిన పాజిటివ్ కేసుల వివరాలను తెలుసుకున్నారు. అలాగే కొత్తగా వచ్చిన పాజిటివ్ కేసుల వ్యక్తులను గుర్తించి ఈ ఇంట్లోకి నో ఎంట్రీ అనేక స్టిక్కర్లను అతికి ఇస్తున్నారు. గతంలో పాజిటివ్ ఉన్న వారిని పరిస్థితి ఏవిధంగా ఉందో రికార్డులలో పేర్కొంటున్నారు. ఇంటింటికి తిరుగుతూ వివరాలను స్వీకరిస్తూ వారి వారి పేర్లను నమోదు చేస్తున్నారు. అలాగే ఏటూరు నాగారం మండలం కోయగూడెం ఎల్లాపూర్ గ్రామపంచాయతీ లోని రాంనగర్, లంబాడి తండ గ్రామాలలో కూడా ఇంటింటి సర్వే చేస్తున్న అంగన్వాడీ టీచర్స్ ఆశావర్కర్లు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: