మన్యంటీవీ,అశ్వారావుపేట:
భద్రద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో వైరస్ కారణంగా ఎవరైనా చనిపోతే దహనసంస్కారాలు చేసేందుకు కుటుంబ సభ్యులు సైతం ముందుకు రావటం లేదు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ సేవా సమితి చేస్తున్న సేవలకు స్పందించి అశ్వారావుపేట ఎక్సైజ్ సిఐ నాగయ్య ఆధ్వర్యంలో స్టాప్ ఒకరోజు సాలరీ 15 వేల ను సేవా సమితి కి అందజేసి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. సేవా సమితి సభ్యులను ఆఫీసుకు పిలిచి పేదల దహన సంస్కారా లకు ఖర్చు చేయమని నగదును అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మీరు చేస్తున్న సేవలకు మేము ఎంత ఇచ్చినా తక్కువే మా సహకారం తప్పక అందజేస్తామని తెలియజేసారు. పేద వారి కష్టాలను చూసి చలించి పోయె మనసున్న మారాజులు ఇంకా ఉన్నారని నిరూపించారు. ఈ కార్యక్రమంలో ఆబ్కారీ సీఐ నాగయ్య, ఎస్ ఐ మరియు సిబ్బంది, పవన్ కళ్యాణ్ సేవసమితి బాద్యులు డేగల రాము, నాగబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: