సీఎం జగన్ నిర్ణయం
అమరావతి :
రాష్ట్రంలో కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశం.
ఫలితాలు రావాలంటే కనీసం నాలుగువారాలు కర్ఫ్యూఉండాలన్న సీఎం
మనం కర్ఫ్యూ విధించి సుమారు 10 రోజులే దాటిందన్న సీఎం
రూరల్ ప్రాంతంలో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం
వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్న సీఎం
కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం
వారికి ఆదుకునేలా ఆర్థికసహాయంపై తగిన కార్యాచరణ రూపొందించాలన్న సీఎం
వారిపేరుమీద కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసేలా, దానిపై వచ్చే వడ్డీ ప్రతినెలా వారి ఖర్చులకోసం వచ్చేలా ఆలోచనలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
..
Post A Comment: