జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి
మన్యం టీవీ మంగపేట.
మంగపేట రైతు సహకార సంఘం అకినేపల్లి మల్లారం డైరెక్టర్ చెట్టుపల్లి సురేష్ అకాల మరణం తీరనిలోటని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు. గత పది రోజులుగా కరోనా జబ్బు తో పోరాటం చేస్తూ శనివారం ఉదయం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చెట్టిపల్లి సురేష్ మృతిచెందగా స్వగ్రామం అకినేపల్లి పల్లి మల్లారం లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ సురేష్ తనకు చిన్ననాటి బాల్యమిత్రుడుఅని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు. సురేష్ చిత్రపటానికి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. సురేష్ భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ తన జ్ఞాపకాలు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పంతగాని వెంకటేష్ దూలగొండ నారాయణ, దూలగొండ సాంబశివరావు, నవుల్ల సాంబశివరావు, శెట్టిపల్లి నిఖిల్ , వంశీ, వెంకటేశ్వర్లు, రాజు, దాసరి ఈశ్వర్, సామ్రాట్, షేక్ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: