ఆపద సమయంలో ఆపద్బాంధవునిగా నిత్యావసర వస్తువుల పంపిణీ
మన్యం టీవీ మణుగూరు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పరిధిలోని పగిడేరు, విజయనగరం,సాంబాయిగూడెం,రామనుజవరం,దమ్మక్కపేట గ్రామాలలో ని 40 మంది కరోనా వైరస్ బారిన పడిన బాధిత కుటుంబాలకు రేగా విష్ణు మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో,తెలంగాణ ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సొంత ఖర్చులతో అందించిన కరోనా నిత్యవసర సరుకుల కిట్ను,విప్ రేగా కాంతారావు ఆదేశాల మేరకు మణుగూరు మండల టిఆర్ఎస్ నాయకులు ఆదివారం కరోనా బాధితుల ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు వారం రోజులు కు సరిపడా నిత్యవసర సరుకులు కిట్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,పీఏసీఎస్ అధ్యక్షులు కుర్రి.నాగేశ్వరరావు, నియోజకవర్గ మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,ఉప సర్పంచ్ ప్రభుదాస్,పట్టణ యువజన నాయకులు రుద్ర వెంకట్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు హరిప్రసాద్,యువజన నాయకులు,స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: