👉ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేదలకు వరం
👉టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్
మన్యం టీవీ, కరకగూడెం:
కరకగూడెం మండలంలోని పద్మపురం గ్రామానికి చెందిన ఈసం నందిని ముఖ్యమంత్రి సహాయ నిధి 16,000/- చెక్కును ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు నందిని ఇంటి ప్రాంగణంలో కరకగూడెం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రావుల సోమయ్య చెక్కును అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.
కరోనా గ్రామంలో విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు భౌతిక దూరం పాటించి,మాస్కులు ధరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తాటి సరోజిని-వెంగళరావు,టిఆర్ఎస్వి పినపాక నియోజకవర్గ అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్,టీఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి మలకం వెంకటేశ్వర్లు,ఆత్మ కమిటి డైరక్టర్ కొంపెళ్ళి పెద్ద రామలింగం,కొలగాని పాపారావు,పడిగ కోటేశ్వరరావు,ఈసం రాజబాబు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: