CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వృద్ధాప్యంలో తల్లిదండ్రుల ను చూసుకోవడం అనేది పిల్లలు తమ బాధ్యతగా గుర్తించాలి:పీకే ఓసి ప్రాజెక్ట్ మేనేజర్ మాలోత్ రాముడు

Share it:

 


మన్యం టీవీ మణుగూరు:

వృద్ధాప్యంలో తల్లిదండ్రుల ను ఏ లోటు రాకుండా తమకున్న దాంట్లోనే వారికి పెడుతూ వారి బాగోగులు చూసుకోవడం అనేది పిల్లలు బాధ్యతగా గుర్తించాలని పీకే ఓసి ప్రాజెక్ట్ మేనేజర్ మాలోత్ రాముడు అన్నారు. గురువారం ఉదయం తమ కుమార్తె రచన జన్మదిన వేడుకల సందర్భంగా అశ్వాపురం మండలం, జగ్గారం గ్రామంలోని ఆరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమానికి 15 లీటర్ల మంచి నూనె డబ్బా ను వితరణగా అందజేశారు.ఇటీవల మృతిచెందిన తన మాతృమూర్తి సుశీల బాయ్ జ్ఞాపకార్థం సంక్షేమ అధికారి ఠాగూర్ మోహన్ సింగ్ మరియు సింగరేణి సివిల్ కాంట్రాక్టర్ సుబ్బారెడ్డి ఇరువురి ఆధ్వర్యంలో 50 కేజీల కందిపప్పును,పీకే ఓసి సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఎండి.మదార్ సాహెబ్ తన తండ్రి జ్ఞాపకార్థం వృద్ధులకు పండ్లును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాలోత్ రాముడు మాట్లాడుతూ తాము చెమట చుక్కలు చిందిస్తూ తమ సంతానానికి పండగ నాడు ఐనా పాయసం పెట్టాలని తల్లిదండ్రులు భావిస్తారని, కానీ వృద్ధాప్యంలో అనేక మంది తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారని,ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు.నిరాదరణకు గురైన అనేక మంది పండుటాకులను చేరదీసి, వారికి పట్టెడన్నం పెడుతూ, కరోనా సమయంలో కూడా వారికి సేవలు చేస్తున్న వృద్ధాశ్రమం నిర్వాహకురాలు ఎస్కె. షేహనాజ్ ను ఆయన అభినందించారు.నిర్వాహకురాలు షహనాజ్ మాట్లాడుతూ వృద్ధాశ్రమం లో సింగరేణి సేవా సమితి, సింగరేణి అధికారులు కార్మికులు,కార్మిక సంఘాల నాయకులు ఎంతగానో తోడ్పా టును అందిస్తున్నారని,నిర్మాణం లో వున్న వృద్ధాశ్రమం సొంత భవనానికి ఆర్థిక సహకారం అందించాలని సింగరేణి ఉద్యోగులను ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిఓ ఎండి.మదార్ సాహెబ్, సంక్షేమ అధికారి ఠాకూర్ మోహన్ సింగ్,సింగరేణి సేవ సమితి సభ్యులు సయ్యద్ నాసర్ పాషా,వృద్ధాశ్రమం నిర్వాహకురాలు ఎస్.కె షహనాజ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: