త్రాగు నీరు కూడా ఏర్పాటు చేయని దుస్థితి...
మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం నందు ఏర్పాటు చేసిన కరోనా పరీక్షా కేంద్రం వద్ద కనీస సౌకర్యాలు లేక కరోనా పరీక్షలు చేయించుకోవడానికి వచ్చినవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మే నెల మండుటెండలో నిలువ నీడ లేక ఉదయం 6 గంటల నుండి క్యూ లైన్ లో నిలబడి మధ్యాహ్నం రెండు గంటల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పటివరకూ అనారోగ్యంతో ఉన్నవారు మండుటెండలో ఉండలేక నానా అవస్థలు పడుతున్నారు. ఈ కోవిడ్ సెంటర్ కు పరీక్షలు చేయించుకోవడానికి రోజు సుమారు 100 నుండి 150 మంది, వరకు వచ్చి పోతుంటారు. వీరికి కనీసం త్రాగునీరు కూడా ఏర్పాటు చేయలేని దుస్థితి నెలకొంది. విషయాన్ని గమనించిన వైద్యాధికారి డాక్టర్ వీరబాబు, మండలంలోని కొంతమంది ప్రజా ప్రతినిధులు, వ్యాపారస్తుల, తో మాట్లాడి పరిస్థితిని వివరించి సౌకర్యాలను ఏర్పాటు చేయించవలసినదిగా కోరినప్పటికీ ఎవరు ముందుకు రాకపోవడం దురదృష్టకరం. కరోనా కష్టకాలంలో బాధితులకు ఎంతోమంది తమ ఆర్థిక స్తోమత కు తగినట్టుగా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కావున మన మండలంలో ఉన్న ప్రజా ప్రతినిధులు, వ్యాపారులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, తమ వంతు సహాయ సహకారాలను వైద్యాధికారి వీరబాబు కు అందించి కనీస సౌకర్యాల కల్పనలో భాగస్వాములు కావాలని మన్యం టీవీ కోరుకుంటుంది. సంఘం నాగరాజు మన్యం టీవీ, రిపోర్టర్ జూలూరుపాడు,
Post A Comment: