CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు మిస్సెల్ మ్యాన్ హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన కార్యక్రమం

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లో *మిస్సెల్ మ్యాన్ హెల్పింగ్ హ్యాండ్స్* వారి ఆధ్వర్యంలో ఆదివారం మణుగూరు జడ్పీ హై స్కూల్,పివి కాలనీ సంత కూరగాయల మార్కెట్ లో మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులకు రక్తం అందించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు. గవర్నమెంట్ వారు 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆదేశించారు. ఈ నేపథ్యంలో  వ్యాక్సిన్ వేసుకున్న వారు రెండు నెలల వరకు రక్త దానం చేయకూడదు అని డాక్టర్లు సూచన మేరకు ఎంతో మంది తలసేమియా తో బాధపడుతున్న చిన్నారుల కు రక్తం అందించాలనే సంకల్పం తో ఈ కార్యక్రమం నిర్వహించాము అని మిస్సెల్ మ్యాన్ హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహుకులు నాగేశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ప్రోత్సహించిన మణుగూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ మౌనిక వారి సహకారంతో దాతలకు కరోనా ర్యాపిడ్ టెస్టు లు చేసి వారి ఆధ్వర్యంలో రక్తం సేకరించడం జరిగింది అని తెలిపారు.ఈ సందర్భంగా డాక్టర్ మౌనిక కు మరియు  రక్త దానం చేసిన దాతలకు ఈ కార్యక్రమానికి సహకరించిన బుద్ధరాజు నర్సింహారాజు (నవీన్ బాబు) కు జయప్రదం చేసిన మిత్రులకు,శ్రేయోభిలాషులకు,మిస్సెల్ మ్యాన్ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ తరుపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సభ్యులు నాగేశ్వరరావు,ఉదయ్,సుమన్,వినయ్,రమేష్,నవీన్,చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: