శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని బి టి పి ఎస్ నిర్వాసితుల ఆందోళన
మన్యం మనుగడ, మణుగూరు:
భద్రాద్రి పవర్ ప్లాంట్ ప్రారంభించినప్పటినుండి భూములు కోల్పోయిన వారికి వారి వారి విద్యార్హతల ప్రకారం శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన బి టి పి ఎస్ యాజమాన్యం ఇప్పటి వరకు కూడా శాశ్వత ఉద్యోగాల ఉాసు ఎత్తడం లేదని దీని కోసం ఎన్ని రోజులు నిరీక్షణ చేయాలని భూ నిర్వాసితులు సి ఈ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సాధ్యమైనంత తొందరగా నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని సి ఈ బాలరాజుకు తెలియజేశారు. ఈ సందర్భంగా బీటీపీఎస్ సి ఈ బాలరాజు మాట్లాడుతూ, మే 15 లోపు శాశ్వత ఉద్యోగాల పరిష్కార దిశగా ప్రయత్నిస్తామని, నిర్వాసితులకుు హామీ ఇవ్వడం జరిగింది.
Post A Comment: