మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మల్లారం గ్రామ పంచాయతీలోని అటవీ క్షేత్రం పరిధిలో చెట్ల నరికివేత కు సంబంధించి కేసు నమోదు చేయడం జరిగింది దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. దుబ్బాక మండలంలోని మల్లారం బీటు జానంపేట సెక్షన్ , రిజర్వు ఫారెస్ట్ ఏరియా కంపార్ట్ మెంట్ నెంబర్ 34 లో పరిధిలో ఫారెస్టు బీట్ అధికారులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో లో అటవీ ప్రాంతం లో కొన్ని చెట్లు నరికి వేయబడి ఉండడాన్ని గమనించి, దానికి సంబంధించిన వివరాలు సేకరించగా ఎనిమిది మంది వ్యక్తులను నరికివేత కు సంబంధించిన వారిగా గుర్తించడం జరిగిందని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏడూళ్ల బయ్యారం ఫారెస్ట్ రేంజ్ అధికారి తేజస్విని తెలిపారు. ఏడూళ్ల బయ్యారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్విని తెలిపిన వివరాల ప్రకారం, వారి వివరాలు
1) పాయం సూర్యనారాయణ 2 తోలెం కృష్ణ 3)కొమరం శ్రీనివాస్ 4) గొంది వెంకటేశ్వర్లు 5)దుబ్బ గట్ల కృష్ణ 6)కొమరం రామారావు 7)కొమరం పాపారావు 8)పోల బోయిన పాపారావు గా గుర్తించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ బి వెంకటేశ్వరరావు, బీట్ అధికారులు అయిన రవీందర్, రంగారావు ,స్వాతి, వేణు నాగేంద్రబాబు , సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: