మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలోని పలు గ్రామాలలో కరోనా పాజిటివ్ వచ్చిన నిరుపేద కుటుంబాలకు జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా నిత్యావసర కిట్లను పంపిణీ చేశారు. మండలంలోని మల్లూరు 1 రాజుపేట 3 రమనక్కపేట 2 చీపురుదుబ్బ 3 మొత్తం 9 మంది కుటుంబాలకు 10 రోజులు సరిపడా వంట సరుకులు కూరగాయలు బియ్యం దాతల సహకారంతో పంపిణీ చేశామని వారు తెలిపారు.ఇంకా దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఇలాంటి పేదల కు టుంబాలకు చేయూత నిచ్చి జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ కి సహకరించగలరని కోరారు.ఈ కార్యక్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్,వైస్ చైర్మన్ బండపల్లి రవి గౌడ్,డైరెక్టర్లు చాదా మల్లయ్య,సయ్యద్ బాబా,పుల్లంశెట్టి అజయ్,పల్లికొండ నరసింహారావు,పాత్రికేయులు జానపట్ల జయరాజ్,మిగతా సభ్యులు పాల్గొన్నారు
Post A Comment: