మన్యం మనుగడ, పినపాక:
కరోనా రాకతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని కిష్టాపురం పంచాయతీ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతోంది. కారణం ఏంటనిఆరా తీయగా, పినపాక మండలం లో కరోనా సోకని ఏకైక పంచాయితీ కిష్టాపురం అని తెలిసింది. సర్పంచ్ సుతారి సుశీల ఆధ్వర్యంలో, పంచాయతీ సెక్రెటరీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో నేటికీ కరోనా సోకని పంచాయతీగా పినపాక మండలం లో నిలిచింది.ఈ విషయమై "మన్యం మనుగడ" సర్పంచ్ సుశీలని వివరాలు కోరగా, కరోనా ప్రారంభం అయిన దగ్గర నుంచి మా పంచాయతీ ప్రజలు కరోనా విస్తరిస్తున్న సమయంలో చేసిన సహకారం వల్లనే ఇది సాధ్యం అయిందని తెలిపారు. పనుల నిమిత్తం పంచాయతీ వదిలి వేరే ప్రాంతానికి వెళ్లిన వారిని,తిరిగి వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉంచామని , అందరితో కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, నేటికీ అదే విధానమును పాటిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. కిష్ఠాపురం పంచాయతీ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్వర్లు చెప్పిన సలహాలు, సూచనల ప్రకారం మా పంచాయతీ ప్రజలందరం తూ.చా తప్పకుండా పాటించామని, అందుకే ప్రశాంత జీవితం గడుపుతున్నామని కిష్టాపురం పంచాయతీ ప్రజలు తెలియజేశారు.
Post A Comment: