CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని బీజేపీ దీక్ష

Share it:

 


మన్యం టీవీ, భూర్గంపాడ్:

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండలంలోని నాయకులు కార్యకర్తలు తమ తమ నివాసాలలో ఇంటి వద్దనే కూర్చొని ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రైతు దీక్ష నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు ముస్కు శ్రీనివాస్ రెడ్డి,బీజేపీ జిల్లా నాయకురాలు, మోరంపల్లి బంజరు సర్పంచ్ కుమారి దివ్య లు తదితరులు దీక్షలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రైతులు పండించిన ధాన్యాన్ని ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతు రుణమాఫీ లక్ష రూపాయల వరకు వెంటనే అమలు చేయాలని ధాన్యం లో తాలు తరుగు పేరుతో చేసే దోపిడీని అరికట్టాలని తడిసిన రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకే కొనుగోలు చేయాలని పెండింగ్ లో ఉన్న పాస్ బుక్ లను రైతులకు అందజేయాలని అదేవిధంగా కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చి పేద ప్రజలను ఆదుకోవాలని కరోనా పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ దీక్ష కార్యక్రమంలో మండల అధ్యక్షులు తాటిపాముల అయిలయ్య ప్రధాన కార్యదర్శి కల్లూరి రామారావు కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు కొల్లు లింగారెడ్డి బీసీ మోర్చా మండల అధ్యక్షులు గోసుల రాములు మండల అధికార ప్రతినిధి సురకంటి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: