చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి.
చండ్రుగొండ రెవెన్యూ కార్యాలయ ఆవరణలో ఉన్న ఇసుకను సోమవారం తహశీల్దార్ ఎం ఉష శారద, బహిరంగ వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటకు మండలానికి చెందిన ట్రాక్టర్ యజమానులు పాల్గొన్నారు. మొత్తం 60 క్యూబిక్ మీటర్ల ఇసుకను. వేలం నిర్వహించారు. ఒక క్యూబిక్ మీటర్ 640 రూపాయలు ప్రభుత్వం ధర నిర్ణయించగా. వేలంలో 910 రూపాయలకు రావికంపాడు గ్రామానికి చెందిన రెడ్డిపోగు సురేష్, దక్కించుకున్నాడు. దీంతో ప్రభుత్వానికి 60 క్యూబిక్ మీటర్ల ఇసుక మీద. రూ 54,600. ఆదాయం వచ్చింది. ఈ సందర్భంగా తహసశీల్దార్ మాట్లాడుతూ.. గత సంవత్సరం మండల పరిధిలోని రేపల్లెవాడ, గానుగపాడు, గ్రామాల మధ్య ఉన్న. యేదుల్ల వాగు పరిసరాల్లో అక్రమంగా నిలువ ఉంచిన 60 క్యూబిక్ మీటర్ల ఇసుకను. పట్టుకొని సీజ్ చేసి రెవెన్యూ కార్యాలయం కు తరలించామని. ఆ ఇసుకను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు. ఈరోజు వేలంపాట నిర్వహించామని. ఈ వేలంపాట ద్వారా 54 వేల 600 రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని తెలిపారు. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా. మట్టి, ఇసుక, ను ఎవరు రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ వి ముత్తయ్య, విఆర్వో సతీష్, ఎంపీటీసీ దారా బాబు, రెడ్డి పోగు సురేష్, కేశబోయిన నర్సింహారావు, సూర వెంకటేశ్వర్లు, రామారావు, బాలు, తదితరులు పాల్గొన్నారు...
Post A Comment: