CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అన్నదాతలకు సబ్సిడి పై జీలుగు,పిల్లి పెసర విత్తనాల పంపిణీ కార్యక్రమం

Share it:

 


మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:: మండల పరిధిలోని గుంపెన గ్రామపంచాయతీలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) వద్ద, మండలంలోని అన్నదాతలకు జీలుగు, పిల్లి పెసర విత్తనాల పంపిణీ కార్యక్రమంను మండల వ్యవసాయ అధికారి-అనుష ఆధ్వర్యంలో పిఎసిఎస్ సొసైటీ చైర్మన్-బోయినపల్లి సుధాకర్ , పిఎసిఎస్ సోసైటి వైస్ చైర్మన్-నల్లమోతు వెంకట్ నారాయణ , వైస్ ఎంపిపి-మామిడిపల్లి రామారావు ప్రారంభించారు. మండలానికి జీలుగు విత్తనాలు 30 కేజీల బ్యాగులు 900 , పిల్లి పెసర విత్తనాలు 20 కేజీల బ్యాగులు 1000 రాగా, అన్నదాతలకు రెండు ఎకరాలకు ఒక బ్యాగ్ చొప్పున , ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారి నుండి పట్టాదారు పాసు పుస్తకాలు, ఆధార్ కార్డు నకలు స్వీకరించి పంపిణీ చేశారు. స్థానిక ఎస్ఐ-పి తిరుపతిరావు ఈకార్యక్రమంలో పాల్గొని, అందరూ సామాజిక దూరం పాటించి, మస్కులు ధరించి విత్తనాల బ్యాగులు తీసుకోవలసిందిగా రైతులకు సూచనలు చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో రైతులు తదితర మండల నాయకులు ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: