మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు ఏరియాలో రెండవ సారి కరోనా సోకిన కార్మికులకు 14 రోజులు క్వారంటైన్ జీతం చెల్లించాలని మణుగూరు ఏరియా సీఐటీయూ బ్రాంచ్ కార్యదర్శి వెంకటరత్నం డిమాండ్ చేశారు. మంగళవారం జరిగిన యూనియన్ సమావేశంలో వెంకటరత్నం మాట్లాడుతూ అన్ని ఏరియాల్లో కోవిడ్ రెండవ సారి సోకిన కార్మికులకు వేతనాలు ఇస్తున్నారని,మణుగూరు ఏరియాలో కూడా వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికులు అందరికి వాక్సిన్ వేయాలని కోరారు.ఈ సమావేశంలో టి.వి.ఎం. వి.ప్రసాద్,నందం.ఈశ్వరరావు,లక్ష్మణరావు,ప్రభాకరరావు,విల్సన్,రామ్మూర్తి,పారుపల్లి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: