CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు అండ

Share it:

 


మన్యం టీవీ, కరకగూడెం:

కరకగూడెం మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన దాసరి స్వప్న ఇటీవలె అనారోగ్య కారణంగా ఆసుపత్రి పాలై బాధపడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా రూ.11వేల విలువ గల చెక్కును ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు ఆదేశాల మేరకు స్వప్న ఇంటి ప్రాంగణంలో కరకగూడెం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రావుల సోమయ్య,స్థానిక సర్పంచ్ బత్తిని నర్సింహారావు అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు రావుల సోమయ్య మాట్లాడుతూ... 

అనారోగ్యం పాలైన వ్యక్తులకు వైద్య ఖర్చుల నిమిత్తం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.కరోనా కష్టకాలంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను అదుకుంటుదని తెలిపారు.అదేవిధంగా 

కరోనా గ్రామంలో ఎక్కువ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి పినపాక నియోజకవర్గ అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్,టీఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి మలకం వెంకటేశ్వర్లు,భూర్గంపహడ్ వ్యవసాయ మార్కెట్ కమిటి ఉపాధ్యక్షుడు కొమరం రాంబాబు,గ్రామ కమిటి అధ్యక్షులు అత్తె సారయ్య,పార్టీ యువ నాయకులు మల్లూరి సందీప్,గుంజ నరేష్,నరసింహులు,సీతయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: