మన్యం టీవీ మంగపేట.
మహిమన్విత శ్రీ హేమాచల (మల్లూరు) లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం హోమం, రథోత్సవం కార్యక్రమాలను కన్నులు పండుగగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో నాలుగవ రోజైన గురువారం ఉదయం ఆలయ అర్చకులు కైంకర్యం రాఘవాచార్యులు, ముక్కామల రాజశేఖర శర్మ, కారంపూడి పవన్ కుమారాచార్యులు, బ్రహ్మోత్సవాల నిర్వాహక పూజారులు, భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ అర్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యులు, వారి బృందం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ప్రత్యేక పూజలు, హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీహేమాచల లక్ష్మీనృసింహ స్వామి రథోత్సవం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. లాక్ డౌన్ ఆంక్షల మేరకు ఆలయ ప్రాంగణం నుండి ఆలయ సమీపంలోని దైత అమ్మవారు(వనదేవత) విగ్రహం వరకు మాత్రమే రధోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ సత్యనారాయణ, ఆలయ సిబ్బంది శివరాజు శేషు, న్యాతాని సీతారాములు, గణేష్, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: