గుండాల ( మన్యం టీవీ) కరోనా బారినపడిన వారికి అండగా నిలుస్తున్నాడు యువకుడు . గుండాల మండల కేంద్రం చెందిన నవ చైతన్య యూత్ అధ్యక్షుడు ఎస్ కె ఆజాద్ కరోనా బారిన పడిన వారికి అండగా నిలుస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. మండలం పరిధిలోని బాట అన్న నగర్ కు చెందిన గిరిజన మహిళ మాఢవి భీమ్ల మహిళ నాలుగు నెలల గర్భిణీ గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి కరోనా పరీక్ష చేయించుకో గా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆమెను తన ఇంటికి తీసుకెళ్లడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో ఆజాద్ తన సొంత వాహనమైన కమాండర్ జీవులొఆమెను ఎక్కించుకొని దించి వచ్చాడు. కరోనా పేరు చెప్తేనే ముందుకు రాని ఈ రోజుల్లో కరోనా పేషంట్ల పట్ల అతను చేస్తున్న సేవలను పలువురు అభినందిస్తున్నారు. కరోనాతో చనిపోయిన వారిని కూడా దగ్గరుండి దహన సంస్కారాలను సాంప్రదాయబద్దంగా జరుపుతూ పలువురి మన్ననలను పొందుతున్నాడు. యువకుడిని ఆదర్శంగా తీసుకొని కరోనా బారిన పడిన వారికి సహాయ సహకారాలు అందించే విధంగా మరికొందరు ముందుకు రావాలి .@,మన్యం టీవీ.
Post A Comment: