మన్యం టీ వీ దుమ్ముగూడెం: ఈరోజు అనగా 21-05-2021 సీతమ్మ సాగర్ ప్రాజెక్టు గ్రామసభలు బహిష్కరించిన,పెదబండిరేవు గిరిజన రైతులు సభలో పాల్గొనాలని ఇచ్చిన నోటీసులుచూపుతున్నరైతులు కరోనామహ్మమారివలనప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భయంతో బ్రతుకు తుంటే, జాయింట్ కలెక్టర్ శ్రీ కర్నాటి వెంకటేశ్వరరావు గారు ఇతర అధికారులు గ్రామసభలు అంటూ మావెంట పడటం ఏమిటని, ఉన్నతాధికారులైన వీరుకరోనాగురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని, ప్రభుత్వం ఒకప్రక్క కఠినమైన ఆదేశాలతో "లాక్ డౌన్"నిర్వహిస్తుంటే, దానిని ఇంకా పకడ్బందీగా అమలు చేయాల్సిన అధికారులు, గ్రామసభలు అంటూ ప్రజలను ఇబ్బంది పెట్టడం ఏంబాగోలేదని ,పెదబండిరేవు ప్రజలు విమర్శిస్తున్నారు. గతంలో జరిగిన గ్రామసభల్లో, ఈసభలు కరోనాతగ్గినతరువాత నిర్వహిం చాలని వినతిపత్రం సమర్పించారు.అయినా వాటినిఅన్నింటిని త్రోసి రాజుని ఇలా రావటం బాధాకరంగా ఉందన్నారు. సోయంలక్షీనర్సు,సోయం నరసింహారావు,పూనెం గోపాలరావు,పూనెంభూపతిరావు, బాబూరావు, నారాయణ బుల్లెమ్మతదితరులు పాల్గొన్నారు.
Post A Comment: