మన్యం టీవీ ఏటూరు నాగారం:
తొమ్మిది పదుల వయసు దాటిన ఒక బామ్మ కరోనా మహమ్మారిని అలవోకగా జయించింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవి పేట కు చెందిన ఎర్రబెల్లి సుగుణమ్మ కు 91 సంవత్సరాలు. 15 రోజుల క్రితం గ్రామంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. దీనితో ఆమెను జాకారం లోని ఐసోలేషన్ సెంటర్ కు తరలించారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్ రావడంతో ఇంటికి తిరిగి వచ్చింది. సరైన సమయంలో చికిత్స. దానికితోడు మనోధైర్యం మానసిక ఆందోళన లేకుండా చికిత్స తీసుకోవడం. వైరస్ పై విజయం సులభమేనని 91 సంవత్సరాల బామ్మ నిరూపించింది. సుగుణమ్మ మందులు పోషకాలున్న ఆహారం డాక్టర్ల సలహా తోనే కొలుకున్నదని ఆమె కూతురు సమ్మక్క ఆనందంగా తెలిపింది.
Post A Comment: