మన్యం టీవీ, పాల్వంచ :-
కోవిడ్ లాక్ డౌన్లో భాగంగా ఈరోజు భద్రాచలం ట్రాఫిక్ ఎస్ ఐ సురేష్ తన సిబ్బందితో పాత కూరగాయల మార్కెట్ వద్ద తనికీలు నిర్వహిస్తుండగా ద్వి చక్రవాహం ను తనిఖీ చేయగా ముందు, వెనుక భాగంలో నెంబర్ ప్లేట్ లేకుండా ఉండగా అట్టి చక్రవాహం కు ను చాసే స్ నంబర్ ద్వారా చెక్ చేయగా, మోటార్ సైకిల్ నంబర్, ఏపి11ఏడీ4192 గుర్తించారు. సంబంధిత ద్విచక్ర వాహన చల్లనాలు చెక్ చేయగా, 61 కేసులు నమోదు ఐ ఉండి రూ. 15,535/- పెండింగ్ లొ ఉన్నట్లు గుర్తించారు.ద్విచక్ర వాహన దారుని పేరు గుడిపల్లి నిఖిలేష్, రాజీవనగర్ కాలనీ, భద్రాచలం అని ఎస్ ఐ తెలిపారు. అతని పైన చల్లనాలు చెల్లించకుండా, వాహనం యొక్క నెంబర్ ప్లేట్ల్ లు తీసివేసి తప్పించుకు తిరుగుచున్నందున, కేస్ నమోదు చేసి తగు చర్య తీసుకోబడునని ఎస్ ఐ తెలిపారు. వాహనాలకు ఉన్న పెండింగ్ చల్లనాలు చెల్లించాలని, వాహనానికి ముందు వెనుక నెంబర్ ప్లేట్ల్ లు ఉండేవిధంగా చూసుకోవాలని తెలిపారు. నెంబర్ ప్లేట్లను వంచడం, నంబర్లను తీసివేసితిరగడం చేసిన వారిపైన చట్టరిత్యా తగు చర్యతీసుకోబడున ని ట్రాఫిక్ ఎస్ఐ సురేష్ హెచ్చరించారు.
Post A Comment: