మన్యం టీవీ, అశ్వరావుపేట:అశ్వారావుపేట మండలంలో గురువారం మరో 53 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాబడ్డాయి. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న కరోనా పరీక్షలకు 50 మంది హాజరు కాగా వారికి స్థానిక ఆరోగ్య సిబ్బంది కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కాగా వీరిలో 26 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు. అదేవిధంగా గుమ్మడవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 21 మందికి కోవిడ్ టెస్టులు చేయగా ఐదుగురికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. వినాయకపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 44 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా అక్కడ 22 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు.
Post A Comment: