గుండాల ఘనంగా కాచన పల్లి అమరుల 30 వర్ధంతిని న్యూ డెమోక్రసీ రాయల వర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇల్లందు సబ్ డివిజన్ నాయకులు పు నెం రంగన్న, పీ వై ఎల్ నాయకులు శేఖర్ లు అమరుల స్తూపం వద్ద జెండా ఎగరవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నేటికీ కాచన పల్లి అమరులు మరణించి 30 సంవత్సరాలు అయిందన్నారు. కాచన పల్లి అమరుల త్యాగాలు ఎన్నటికీ మరిచిపోలేని వని వారు కొనియాడారు. ప్రజల కోసం పనిచేసే నాయకులు కోటన్న. నంబూరి సీతారామారావు. పరశురాములు, సుసేన కుమారి, చింత లక్ష్మి లను, పట్టుకొని హత్య చేశారన్నారు. వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు లాజర్ ,రమేష్ ,వీరన్న ,చిరంజీవి ,శ్రీనివాస్ ,సత్యం ,రమేష్ ,భూషణం ,తదితరులు పాల్గొన్నారు
Post A Comment: