CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఈ నెల 26వ తేదీన ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీలుగా ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, సుర‌భి వాణీదేవి ప్ర‌మాణ‌స్వీకారం

Share it:

 ఈ నెల 26వ తేదీన ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీలుగా ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, సుర‌భి వాణీదేవి ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. మండ‌లి చైర్మ‌న్ వీరిద్ద‌రి చేత ప్ర‌మాణం చేయించ‌నున్నారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం నిరాడంబ‌రంగా జ‌ర‌గ‌నుంది.


మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుర‌భి వాణీదేవి విజయం సాధించిన విష‌యం తెలిసిందే. వాణీదేవి మొత్తం 1,89,339 ఓట్లు సాధించి సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఎన్. రాంచందర్‌రావుపై ఆమె గెలుపొందారు.


నల్లగొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు, ఎలిమినేషన్ ప్రక్రియ అనంతరం అధికారులు ఆయన్ను విజేతగా ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి ఎన్నిక‌వ‌డం వ‌రుసగా ఇది రెండోసారి.

Share it:

Post A Comment: