మన్యం టీవీ, అశ్వరావుపేట:
కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల్లో అశ్వారావుపేట మండలంలో ఆదివారం మరో 22 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మూడు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల పరిధిలో 82 మందికి పరీక్షలు నిర్వహించగా 22 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అశ్వారావుపేట పీహెచ్ సీలో 42 మందికి గాను 20, వినాయకపురం పీహెచ్ సీలో 25 మందికి గాను 2, గుమ్మడవల్లి పీహెచ్ సీలో 15 మందికి గాను 0 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు.
Post A Comment: