చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి.
పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లిం సోదరులకు బుధవారం చండ్రుగొండ లో ఆరెంజ్ సిటీ ప్రూట్స్ కంపిని యజమానులు... బబ్లు భాయ్, పునిత్ భాయ్, చిట్టిబాబు, ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు (భోజనం) ఏర్పాటు చేసారు. ఈ ఇఫ్తార్ విందు కు మండలం లోని ముస్లిం సోదరులు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ముస్లిం సోదరులకు ఇఫ్తార్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో మొదటి సారిగా మామిడి రైతులకు ఇబ్బందులు లేకుండా చండ్రుగొండ లో మార్కెట్ ఏర్పాటు చేయడం వల్ల రైతులకు ఇబ్బందులు తొలిగి పోయాయన్నారు గతంలో రైతులు పండించిన మామిడి పంటలు అమ్ముకోవాలంటే వందల కిలోమీటర్లు వెల్లి ఇబ్బందులు పడేవారు అలాంటి ఇబ్బందులు ఉండకూడదనే గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ ఏర్పాటు చెసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని. అన్నారు. త్వరలో కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కూడా మార్కెట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనిని జిల్లా లో ఉన్న మామిడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు...
Post A Comment: