జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి
మన్యం టీవీ మంగపేట.
సుగంధ పంటల ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన తోనే మిర్చి రైతులకు మంచి గిట్టుబాటు ధర సాధ్యపడుతుందని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గం పహాడ్ మండలం లక్ష్మీపురం వద్ద నిర్వహిస్తున్న శ్రీరామ స్పైస్ ఇండస్ట్రీస్ పరిశ్రమను పరిశీలించారు. ఈ సందర్భంగా సాంబశివ రెడ్డి యాజమాన్యంతో మాట్లాడుతూ, స్థల సేకరణ, ప్రభుత్వ అనుమతులు, రామెటీరియల్ సేకరణ, రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపు, విద్యుత్ సరఫరా, మార్కెటింగ్, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ రాయితీలు, ఉద్యోగుల నియామకం... మొదలగు విషయాలను యాజమాన్యం నుండి అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా సాంబశివ రెడ్డి మాట్లాడుతూ ...సుగంధ పరిశ్రమల స్థాపనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గోదావరి పరివాహక ప్రాంతంలో లో మంచి నాణ్యత ప్రమాణాలతో కూడిన మిర్చిని ఈ ప్రాంత రైతులు పండిస్తున్నారని మిర్చి కారం పరిశ్రమతో పాటు, పసుపు ప్రాసెసింగ్ యూనిట్లను సైతం స్థాపించి ఎగుమతులు చేసే స్థాయికి మన పరిశ్రమల యాజమాన్యం ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శ్రీ రామ స్పైస్ ఇండస్ట్రీ యజమాని సత్యనారాయణ, వికాస్ ఆగ్రీ ఫౌండేషన్ వైస్ చైర్మన్, పచ్చిపులుసు నరేష్, శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: