మన్యం టీవి:
ములకలపల్లి మండలం: ములకలపల్లి మండలంలోని రామచంద్రపురం గ్రామంలో సర్పంచ్ సున్నం సుధాకర్ అద్వర్యంలో 175 మందికి వైద్య సిబ్బంది కరోన పరీక్షలు చేయగా, 22 మందికి పాజిటివ్ వచ్చింది.ఇలా వరుసగా మంగళవారం చేసిన పరీక్షలలో 9 మందికి, బుధవారం రోజున 8 మందికి కరోనా పాజిటివ్ రావటంతో ఆ గ్రామ ప్రజలు భయంతో కలవర చెందుతున్నారు. వీరంతా ఇటీవలే మిరపకాయ కోతల పనికి , జూలూరుపాడు, ఏన్కూరు ప్రాంతాలకు వెళ్లారు. సర్పంచ్ సున్నం సుధాకర్ కరోనా బాధితులకు మండల వైద్య అధికారుల ద్వారా ఆరోగ్య సూచనలు తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య ఆరోగ్య సిబ్బంది మాట్లాడుతూ మండలంలోని
రామచంద్రపురం - 22, గుట్టగూడెం - 01, ములకలపల్లి - 01 విధంగా కేసులు నమోదు అయ్యాయిని,అందరూ విధిగా మాస్క్ ధరించాలని.భౌతిక దూరం పాటించండి, అవసరమైతే తప్ప బైటికి వెల్లవద్దు అని తెలియజేశారు .
Post A Comment: