మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి: ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తూ, విచ్చలవిడిగా పెరిగిపోతున్న కరోనా పరిస్థితుల కారణంగా, అన్నపురెడ్డిపల్లి మండలంలోని పెద్దిరెడ్డిగూడెం(ఎర్రగుంట) గ్రామంలో గ్రామపంచాయతీ పాలకవర్గం మరియు గ్రామ పెద్దలు, దుకాణదారుల ఆలోచన నిర్ణయం మేరకు గ్రామంలో ఉదయం నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే అన్ని వ్యాపార దుకాణాలు నిర్వహించాలని, మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత నుంచి స్వచ్ఛందంగా గ్రామంలో లాక్ డౌన్ పాటించాలని, గ్రామ పంచాయతీ తీర్మానం చేసినట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి-విజయ్ తెలియజేశారు.
Post A Comment: