మన్యం టీవీ భద్రాచలం భద్రాచలం పట్టణం కూనవరం రోడ్డు లో లారీ ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే భద్రాచలం పట్టణం నకు చెందిన రాయపాటి నరేందర్ 27 సంవత్సరములు గల యువకుడు గురువారం ఉదయం తన లాండ్రీ షాపు వద్దకు వస్తుండగా రాయిపూర్ నుండి బయలుదేరిన చెన్నైకి వెళ్లే లారీనెంబర్ టి ఎన్ 70 జె4563గల లారీ సిఆర్పిఎఫ్ క్యాంపస్ దగ్గర ఢీకొట్టడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య,ఆడపిల్ల ,మగ పిల్లవాడు ఇద్దరు చిన్నపిల్లలు గలరు. లారీ డ్రైవర్ ను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు,
Post A Comment: