మన్యం న్యూస్ గుండాల (ఆళ్ల పల్లి): కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆళ్లపల్లి మండలం పరిధిలోని మర్కోడు గ్రామంలో చోటు చేసుకుంది మర్కోడు గ్రామానికి చెందిన ఈసారి సతీష్ కు చెంబు ని గూడెం గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది సతీష్ కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండటంతో పలుమార్లు పెద్దల సమక్షంలో సర్ది చెప్పేవాళ్లు శుక్రవారం భార్య పోలీసులను ఆశ్రయించడంతో అల్లపల్లి ఎస్ఐ ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు మనస్థాపానికి గురైన సతీష్ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అల్లపల్లి ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Navigation
Post A Comment: