CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఓ వైపు ఎండ - మరో వైపు కరోనా...

Share it:

 





                                       

మన్యంటీవీ,అశ్వారావుపేట:

పట్టణం వాసులే కాదు పల్లె సీమలు సైతం భయం భయంగా బతుకునీడుస్తున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ విలియం తాండవం పల్లెలకు విస్తరించి ప్రజలు ఆందోళనకు గురి అవుతుండగా మరో వైపు భానుడు తన వేసవి ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నాడం. వైరస్ సాధారణ పల్లెలు సైతం కర్ఫ్యూ తలిపిస్తున్నాయి.

అశ్వారావుపేట మండల పరిధిలోని తిరుమలకుంట, రెడ్డిగూడెం, తొగ్గూడెం, బండారిగుంపు గిరిజన గ్రామంలో వేసవి ఎండల తీవ్రతకు జనం హడలిపోతున్నారు. మరో వైపు కరోనా మహమ్మారి భయపెడుతోంది. దీంతో ప్రధాన రహదారులు జన సంచారం లేక బోసిపోయాయి. ఉదయం 11 గంటలు దాటితే ఎండ ధాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. అశ్వారావుపేట పల్లె ప్రాంతాలలో ఎండ తీవ్రతకు ప్రజలు లేక ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. తీవ్రమైన ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు ప్రభావంతో పనుల కోసం బయటకు వచ్చే కూలీలు - నాలీలు సైతం ఇల్లు దాటి బయటకు రావడానికి భయపడుతున్నారు. తిరుమకుంట, రెడ్డిగూడెం, తొగ్గూడెం, బండారిగుంపు  ప్రధాన కూడళ్లు, ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎండవేడిమి తగ్గకపోవడంతో జనసంచారం లేక సెంటర్లు  బోసిపోయింది.

Share it:

TELANGANA

Post A Comment: