మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లో నూతనంగా నిర్మిస్తున్న అంబేద్కర్ సర్కిల్ పనులను మంగళవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా మున్సిపల్, ఎలక్ట్రికల్,పోలీసు అధికారులతో అంబేద్కర్ సర్కిల్ పనులపై సలహాలు సూచనలు చేశారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పొశం.నరసింహారావు,మున్సిపల్ కమిషనర్ నాగ ప్రసాద్,సిఐ భాను ప్రకాష్,ఎలక్ట్రికల్ అధికారులు,ఎంపీడీఓ పి.వెంకటేశ్వర్లు,వైస్ ఎంపీపీ కె.వి.రావు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు,యువజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: