👉 ప్రజాసేవలో ఫ్రెండ్లీ పోలీస్-అన్నపురెడ్డిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ పి తిరుపతిరావు
మన్యం మీడియా,అన్నపురెడ్డిపల్లి: అన్నపురెడ్డిపల్లి మండలం, ఎర్రగుంట గ్రామ ప్రధాన సెంటర్లో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ పి తిరుపతిరావు, ప్రజలకు కరోనా సెకండ్ వేవ్ గురించి అవగాహన చేసి, కోవిడ్-19 బారిన పడకుండా ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్క్ ధరించాలని, రద్దీగా ఉన్న జన సమూహాలకు దూరంగా ఉంటూ సామాజిక దూరం పాటించాలని, అప్పుడప్పుడు శానిటైజర్ చేసుకోవాలని, పరిమితితో కూడిన శుభ కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రి నందు ఉచితంగా వేస్తున్న కరోనా వ్యాక్సిన్ విధిగా అందరూ వేయించుకోవాలని, 45 సంవత్సరాలు దాటిన వారు ప్రతి ఒక్కరూ కచ్చితంగా టీకా వేయించుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, దుకాణదారులు, ప్రజలు ఉన్నారు.
Post A Comment: