మన్యం టీవి, దుమ్ముగూడెం:
భద్రాచలం డివిజన్ పరిసర ప్రాంతాల నుంచి యధేచ్ఛగా టేకు కలప అక్రమ రవాణా జరుగుతోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం
అటవీ శాఖ అధికారుల అండదండల తో సమాజంలో ప్రముఖులుగా గుర్తింపు పొందిన కొందరు అర్ధరాత్రి సమయాల్లో యదేచ్చగా అక్రమ కలప అక్రమ రవాణా చేస్తున్నారు.
భద్రాచలం డివిజన్ దుమ్ముగూడెం మండలం పెద్ద బండి రేవు వద్ద టేకు కలపను ట్రాక్టర్ లో లోడ్ చేస్తుండగా గిరిజనుడి మీద పడి అక్కడికక్కడే కోడి శ్రీను అనే వ్యక్తి మృతి చెందాడు.
పెద్ద బండి రేవులో ప్రత్యేకంగా కలప కటింగ్ మిషన్లు ఏర్పాటు చేసి కలపను మొద్దులుగా కట్ చేస్తూ.... ఫర్నిచర్ తయారు చేస్తూ యదేచ్ఛగా కలప అక్రమ రవాణా చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ఎవరికీ అనుమానం రాకుండా
ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ తరహాలోనే టేకు కలప మొద్దుల పై నెంబర్లు వేసి రవాణా చేస్తున్నారు...
గిరిజనుడు ప్రమాదవశాత్తు మృతి చెందడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Post A Comment: