మన్యం మనుగడ, పినపాక:
పినపాక మండలం లోని పినపాక పంచాయతీలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (వందరోజుల పని) పనితీరును పినపాక పంచాయతీ సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు సోమవారం పర్యవేక్షించారు. పినపాక పంచాయతీ లో గల కృష్ణసాగర్ కుంట లో జరుగుతున్న పనులను గురించి వివరణ కోరారు. ఉపాధి హామీ అధికారి కృష్ణకుమారిని వందరోజుల పని కి సంబంధించిన అన్ని వివరాలను కోరగా,ఆమె సవివరంగా సర్పంచ్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ, 100 రోజుల పని కి సంబంధించి చి కూలీలకు వారి ఖాతాలో త్వరగా డబ్బు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, వారి జీవనాధారానికి అధికారులు తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. కూలీలు పని చేసే సమయంలో అనారోగ్యానికి గురైతే వారికి సంబంధించిన దగ్గరగా ఉంచుకోవాలని, వారికి తెలియ చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో పినపాక పంచాయతీ సెక్రటరీ రాజు, కూలీలు, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: